AP | ప్రధాని మోదీ, అమిత్ షా లకు చంద్రబాబు కృతజ్ఞతలు..
ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ నిధులు మంజూరు చేసింది. ఈ క్రమంలో గతేడాది ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమైన ఏపీకి కేంద్రం రూ.608.08 కోట్లు మంజూరు చేసింది.
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు… ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
ప్రకృతి విపత్తు బాధిత రాష్ట్రాలకు ప్రకటించిన రూ.1554.99 కోట్లలో… ఏపీకి రూ.608.08 కోట్లు కేటాయించినందుకు చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.