- ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
అమరావతి, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 20 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేసింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గౌరవ చైర్మన్గా, మల్లా శ్రీనివాసరావు ఛైర్మన్గా నూతన కమిటీని ప్రభుత్వం ప్రకటించింది.
సభ్యులుగా నక్కా చంద్రకళ, జుట్టు ఊర్వశి, మందనాల జోగారావు, ఎన్. రామారావు, కొట్ర వైకుంఠరావు, అంబటి రామకృష్ణ, అరియపల్లి తేజశ్వరరావు, మార్పు ఆశారాణి, నొక్కు శ్రీదేవి, పుచ్చా జానకమ్మ, సవర జానకి, బి.భాస్కరరావు, కిల్లి బాలకృష్ణ, కె. శాంతికుమారి తదితరులను నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.