- నాలుగు గ్రామాల్లో పైలెట్గా అమలు
- దాదాపు 40 లక్షల కుటుంబాలకు లబ్ధి
- ఆగస్టు కల్లా 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి
- అధికారులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పీ-4 కార్యక్రమానికి ఉగాది నుంచి శ్రీకారం చుట్టనుంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పీ-4 విధానాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
దీనికి సంబంధించి పీ-4, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ – బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉండవల్లి నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
పేదరికం లేని సమాజమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. సంపన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు, మద్దతుగా నిలబడటమే పీ4 విధానం ముఖ్య ఉద్దేశం కావాలని నిర్దేశించారు.
ఇందుకు నిర్మాణాత్మక, స్థిరవెున విధానం ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పీ-4 విధానం ఈ ఉగాది నాటికి కార్యరూపం దాల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
తొలుత రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పీ-4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ పైలెట్ ప్రాజెక్టుతో 5,869 కుటు-ంబాలకు లబ్ది పొందుతాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఆగస్టుకు కుటుంబాల ధృవీకరణ
పిీ-4 విధానం ద్వారా లబ్ది పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను జీఎస్డబ్లుఎస్ డేటాబేస్, హౌస్హోల్డ్ సర్వే, గ్రామసభ ధృవీకరణ ద్వారా గుర్తించడం జరుగుతోంది. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న భూ యజమానులను, ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారిని, ఫోర్ వీలర్ ఉన్నవారిని, 200 యూనిట్లు కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందజేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు పీ-4 కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
కొనసాగుతున్న హౌస్ హోల్డ్ సర్వే
హౌస్ హోల్డ్ సర్వే మొదటి దశ కింద రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే జరుగుతోంది. ఇది మార్చి 2నాటికి పూర్తవుతుంది. ఈ పది జిల్లాల్లో 52 లక్షల కుటు-ంబాలు ఉంటే 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయ్యింది. రెండో దశ కింద రాష్ట్రంలో మిగిలిన 16 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే మార్చి 8 నుంచి మొదలుపెట్టి మార్చి 18 నాటికి పూర్తి చేస్తారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. పేద కుటు-ంబాలకు ఇప్పటికే అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాలకు అదనంగా వారి సాధికారత కోసం పి-4 విధానం ద్వారా సాయం చేయనున్నారు. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికే తప్ప,వీటి ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ది దారుల్లో ఎటు-వంటి మార్పులు చేయరు.
బంధనమ్ ఫ్లాట్ ఫామ్లో కుటుంబ వివరాల నమోదు…
లబ్దిదారుల ధృవీకరణ పూర్తి అయిన తర్వాత సమృద్ధి బంధనమ్ ప్లాట్ ఫామ్లో ఆయా కుటు-ంబాల వివరాలు పొందు పరుస్తారు. లబ్ది పొందాల్సిన కుటు-ంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛంధంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.
పీ-4 లోకి ఆగస్ట్ కల్లా 5 లక్షల కుటుంబాలు ..
ఈ ఉగాదికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి రానున్న ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల అభిలాషి కుటుంబాలను సమృద్ధి బంధనమ్ కింద తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, కాటంనేని భాస్కర్, ప్లానింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.