నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 26 : నంద్యాల జిల్లా శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీశైలం దగ్గరలో ఉన్న రుద్రపార్కు సమీపంలో ఓడపై చిరుత పులి మృతదేహం ఉండటం శ్రీశైలంకు వచ్చిన భక్తులు గమనించారు. చనిపోయిన చిరుత పులి గోర్ల ను కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ మధ్య గత రెండు నెలల కాలంగా శ్రీశైలం దేవస్థాన పరిధిలోని రోడ్డు ప్రాంతంలోనూ ఓ పూజారి ఇంట్లో ఉన్న చిరుత పులి ప్రత్యక్షం కావటం గమనించారు. దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.