జన్నారం, ఆంధ్రప్రభ : పెట్టకేలకు పాలగోరి ప్రాంతంలో వేసిన 9 గుడిసెలను శుక్రవారం మధ్యాహ్నం తొలగించారు. మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని కవ్వాల సెక్షన్ సోనాపూర్ తండా అటవీ బీట్ పాలగోరి ప్రాంతంలో రెండు నెలల క్రితం ఆదివాసీలు వేసుకున్న 9 తాత్కాలిక గుడిసెలను స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్ ఆదేశాల మేరకు లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి, స్థానిక తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి సమక్షంలో అటవీ అధికారులు తొలగించారు.
దీంతో ప్రస్తుతం పాలగోరి సమస్య సద్దుమణిగినట్టయింది. ఈ కార్యక్రమంలో ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీధరచారి, స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష, ఫారెస్ట్ రేంజు ఆఫీసర్లు సుష్మారావు, రత్నాకర్ రావు,అనిత,హఫీజోద్దీన్,200 మంది అటవీ డిప్యూటీ రేంజు ఆఫీసర్లు, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.


