Anniversary | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Anniversary | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Anniversary | ఆంధ్ర్రప్రభ వెబ్డెస్క్ : ఇవాళ బసవేశ్వరుడి 839వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 839 ఏళ్ల క్రితం బసవేశ్వరుడి రూపంలో కొత్త విప్లవం పుట్టిందని పేర్కొన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో సామాజిక న్యాయం కోసం తాను పెట్టబోయే రాజకీయ పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కుల, లింగ వివక్ష లేని సమానత్వం కోసం బసవేశ్వరుడు అప్పట్లోనే పోరాడారని, అంబేడ్కర్ సైతం ఆయన నుంచి స్ఫూర్తి పొందారని కవిత గుర్తు చేశారు. పార్లమెంట్లో మహిళా బిల్లును అడ్డుకోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
