తిరుమల క్యూ కాంప్లెక్స్లో…
ఎన్ఆర్ఐ దాతృత్వంతో…
వెబ్ డెస్క్, తిరుమల : ఈనెల 25న సీఎం చంద్రబాబు (CM Chandrababu) చేతుల మీదుగా ప్రారంభించబోతున్న సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ని టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) బోర్డు సభ్యుడు నరేష్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, సీవీఎస్ వో మురళీకృష్ణ, విజివో రాంకుమార్ లతో కలిసి పరిశీలించారు. శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కృతిమ మేదస్సు (ఏఐ) ను వినియోగించాలని చైర్మన్ నిర్ణయం ప్రకారం…. ఎన్ఆర్ఐల దాతృత్వం ( NRIs generosity) తో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తుంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 (Vaikuntam Q Complex 1) లోని 25వ నెంబర్ కంపార్ట్ మెంటులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ కేంద్రాన్ని ఈనెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) అందుబాటులోకి వస్తే ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను ఒకసారి పరిశీలిస్తే…
“ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు (CCTV footage) కనిపిస్తాయి. వీటిని 25మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు ? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.
ఫేస్ రికగ్నిషన్ (Face recognition) సాంకేతికత ద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది.. భక్తుల ముఖ కదలికలు (హావభావాలు) ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది. క్యూలైన్లు, వసతి.. ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3డీ మ్యాప్ లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది.
ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు (Cyber attacks), టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుంది.

