England vs India – నిలకడగా కోహ్లీ, గిల్ బ్యాటింగ్..
అహ్మదాబాద్ వేదికగా చివరి వన్డే
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు
జడేజా, వరుణ్ చక్రవర్తి, షమీ ఔట్
జట్టులోకి సుందర్, కుల్దీప్, అర్ష్దీప్
తొలి ఓవర్లలోనే రోహిత్ శర్మ పెవిలియన్ కు
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం భారత్ 11 ఓవర్లలో వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది..కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇక రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 6 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ బరిలోకి వచ్చి గిల్ తో కలసి బ్యాటింగ్ చేస్తున్నాడు.. వీరిద్దరూ కలసి వికెట్ పడకుండా నిలకడగా ఆడుతున్నారు.. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేనాటికి కోహ్లీ 26 పరుగులతోనూ, గిల్ 29 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు..
ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. అటు ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. జేమీ ఒవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ ను తీసుకుంది.
ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ చూస్తోంది. ఇంగ్లీష్ జట్టు మాత్రం ఈ ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.
ఇంగ్లండ్ జట్టు: ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ వింగ్స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్.