కర్నూలు బ్యూరో, జూన్ 23, ఆంధ్రప్రభ : ఒలంపిక్స్ ఇచ్చిన స్ఫూర్తితో భావితరాలకు క్రీడల పట్ల చైతన్యం తెచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని కర్నూలు ఒలంపిక్ సంఘం చైర్మన్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ (K.E. Prabhakar) అభిప్రాయపడ్డారు. సోమవారం కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం ఆధ్వర్యంలో అట్టహాసంగా ఒలంపిక్ రన్ (Olympic run) వేడుకలను నిర్వహించారు. ముందుగా పాత నగరంలోని ఓల్డ్ టౌన్ నందు ఒలంపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి అవినాష్ శెట్టి ఆధ్వర్యంలో పరుగును ప్రారంభించారు.
రెండవ కేంద్రమైన కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, జిల్లా ఒలంపిక్ సంఘం సీఈవో విజయ్ కుమార్, నిర్వహణ కార్యదర్శి పి సునిల్ కుమార్, జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్రారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీని ప్రారంభించారు. మూడవ కూడలి అయిన ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ డి.ఎస్.పి మెహబూబ్ భాష పరుగును ప్రారంభించారు. నాలుగవ ప్రాంతమైన బిర్లా గేట్ వద్ద ఉన్న కాన ఖజానా వద్ద జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, పి.ఈ.టి ల అధ్యక్షుడు జోసఫ్ లక్ష్మయ్యలు పరుగు ప్రారంభించారు. ఐదవ కూడలి అయిన చిన్నమ్మ సర్కిల్ వద్ద క్రీడా సంఘాల ప్రతినిధులు వేటరన్ సంఘం కార్యాదర్శి రవికుమార్, ఈశ్వర్ నాయుడుల ఆధ్వర్యంలో పరుగున ప్రారంభించారు.
అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైన పరుగు రాజ్ విహార్ కు చేరుకొని అక్కడ సమూహంగా ఏర్పడి క్రీడా జ్యోతులతో అతిథులు కర్నూల్ ఔట్ డోర్ స్టేడియం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ… జిల్లాలో క్రీడా చైతన్యం నింపేందుకు గత 15 సంవత్సరాలకు గా కర్నూల్ నగరంలో రాజకీయాలకు అతీతంగా ఒలంపిక్ పరుగును నిర్వహిస్తున్నామన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పరుగులో పాల్గొని విజయవంతం చేయడం ఆనందదాయకమన్నారు. క్రీడలకు కర్నూల్ పెట్టింది పేరని, ఒలింపిక్ పరుగు నిర్వహణలో రాష్ట్రంలోనే కర్నూల్ ప్రథమమన్నారు. ఐదు ప్రాంతాల నుంచి సుమారు మూడు వేల మంది క్రీడాకారులు పరుగులో పాల్గొని విజయవంతం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షుడు దీప్తి, కన్వీనర్ యాని ప్రతాప్, కర్నూల్ బార్ కౌన్సిల్ అధ్యక్షులు హరినాధ్ చౌదరి, బాక్సింగ్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ స్కేటింగ్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, ఉషూ శ్రీనివాసులు, పీఈటీలు సత్య, లోకేష్, శ్యామ్, ఆరిఫ్, జిల్లా తెక్వండో సభ్యులు వీరేశ్ బాబు, శివ, విజయ డైరీ మేనేజర్, జిల్లా అవోపా సభ్యులు, సాయి స్పోర్ట్స్ సెంటర్ క్రీడాకారులు, పలువురు పీఈటీలు, క్రీడ సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, పాల్గొని ఒలింపిక్ పెరుగును జయప్రదం చేశారు.
