AP |కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి చర్యలు : మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో, జూన్ 17 : కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (TG Bharat) పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం జగన్నాథ గట్టు వద్ద ఉన్న టిడ్కో గృహాలకు ఎదురుగా ఆరు ఎకరాల్లో గ్రీన్ కో కంపెనీ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియం, క్రీడా కాంప్లెక్స్ కు మంత్రి శంకుస్థాపన (Foundation stone laying) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ల, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ బాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ… హైవే దగ్గరలో క్రికెట్ స్టేడియం (Cricket stadium) ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ స్టేడియం ఏర్పాటు కర్నూలు జిల్లాలో అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో బాల సాయిబాబా స్కూల్ పక్కన ఉన్న ఏసీఏ క్రికెట్ గ్రౌండ్ లో కూడా స్టేడియం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్రీడల వల్ల జీవితంలో కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారని మంత్రి తెలిపారు. గ్రీన్ కో కంపెనీ పి4 విధానం ద్వారా ముందుకు వచ్చి సీఎస్ఆర్ కింద స్టేడియం నిర్మించడం అభినందించాల్సిన విషయమన్నారు.

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ బాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని ప్ర‌సంగించ‌గా, కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు, గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, గ్రీన్ కోఅసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయుడు, తదితరులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Leave a Reply