మణిపూర్లోని చందేల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. , ‘భారత్-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చందేల్ జిల్లా, ఖేగ్జోయ్ తహసీల్లోని న్యూ సమ్తాల్ గ్రామం సమీపంలో సాయుధ కేడర్ల కదలిక గురించి భారత భద్రతా దళాలకు నిర్దిష్ట సమాచారం అందింది. దీంతో అప్రమత్తమై స్పియర్ కార్ప్స్ ఆధ్వర్యంలోని అస్సాం రైఫిల్స్ యూనిట్ ఆపరేషన్ ప్రారంభించామని భారత సైనిక బలగాలు వెల్లడించాయి. అయితే, ఈ ఆపరేషన్ సమయంలో, అనుమానిత కేడర్ల నుండి కాల్పులను ఎదుర్కొన్నట్టు అధికారులు తెలిపారు.
ఇక ఈ కాల్పులకు ప్రతీకారంగా సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ భారత దళాల ఎదురుకాల్పుల్లో సుమారు 10 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత వారి నుంచి భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మీ తూర్పు కమాండ్ తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియజేసింది.