Air Fleets | భారత్ ఎదురుదాడి – పాక్ లోని నాలుగు వైమానిక స్థావరాలు ధ్వంసం

సరిహద్దుల్లో 26 చోట్ల పాక్ డ్రోన్లు, శతఘ్నులతో దాడి
ప్రతిగా పాక్‌లోని 4 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడిన భారత్
 దాడులను ధ్రువీకరించిన పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్.
రావల్పిండి, చక్వాల్, షోర్కోట్‌లలోని పాక్ ఎయిర్‌బేస్‌లలో పేలుళ్లు
నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం ప్రెస్‌మీట్‌


న్యూ డిల్లీ – భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడగా, భారత బలగాలు దీటుగా స్పందించాయి. పాకిస్థాన్‌లోని నాలుగు కీలక వైమానిక స్థావరాలతోపాటు డ్రోన్ లాంచ్‌ప్యాడ్స్‌పై భారత్ ప్రతిదాడులు నిర్వహించింది. ఈ దాడుల ఘటనను పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.

శుక్రవారం పగటిపూట కొంత ప్రశాంతంగా ఉన్న సరిహద్దు వాతావరణం చీకటి పడిన తర్వాత ఒక్కసారిగా వేడెక్కింది. పాకిస్థాన్ సైన్యం బారాముల్లా నుంచి భుజ్ వరకు సుమారు 26 ప్రదేశాలపై డ్రోన్లు, ఫిరంగులతో దాడులకు తెగబడింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపురాలోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది.

పాకిస్థాన్ దుస్సాహసానికి ప్రతిగా భారత బలగాలు ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు సమాచారం. రావల్పిండి సమీపంలోని చక్లాలాలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌, చక్వాల్‌లోని మురీద్‌ ఎయిర్‌బేస్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లోని రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన విషయాన్ని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు. భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం పేర్కొన్నట్లు సమాచారం. కాగా, పాకిస్థాన్ తమ దాడులకు ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అని పేరు పెట్టింది.

అయితే, పాకిస్థాన్‌పై జరిగిన ఈ ప్రతిదాడుల గురించి భారత వాయుసేన గానీ, సైన్యం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. తాజా పరిణామాలపై నేటి (శనివారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

పాకిస్తాన్‌లోని నాలుగు కీలకమైన వైమానిక స్థావరాలపై భారత్ రాత్రిపూట విజయవంతంగా దాడి చేసి, సైనిక స్థావరాలు, ఆస్తులకు భారీ నష్టం కలిగించిందని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్, చక్వాల్‌లోని మురిద్, షోర్కోట్‌లోని రఫికి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో పాకిస్తాన్ మధ్యాహ్నం 12 గంటల వరకు తన గగనతలాన్ని మూసివేసింది. పెషావర్‌కు వెళ్లే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం PIA218 పాకిస్తాన్ గగనతలంలో చివరి వైమానిక విమానం అని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్‌తో సహా ప్రధాన నగరాల్లో పేలుళ్లు సంభవించాయని పాక్ అధికారులు వెల్లడించారు.

భారత్ దాడులతో పాక్ వైమానిక వ్యవస్థ ధ్వంసం

— పాక్‌లో 3 ఎయిర్‌బేస్‌లపై విరుచుకుపడిన భారత్‌
— రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ వైమానిక స్థావరంపై దాడి
— చక్‌వాల్‌లోని మురిద్‌ ఎయిర్‌బేస్‌ ధ్వంసం
— షార్‌కోట్‌లోని రఫీకీ ఎయిర్‌వేస్‌పై విరుచుకుపడిన భారత్‌
— ఇస్లామాబాద్‌తోపాటుపాటు, లాహోర్‌, పెషావర్‌..
— రావల్పిండిలోని ఎయిర్‌బేస్‌లను మూసేసిన పాక్‌
— 4 వైమానిక స్థావరాలతోపాటు, మొత్తం పాక్‌ గగనతలం క్లోజ్‌

Leave a Reply