Sea Bahubali | ఐఎన్ఎస్ విక్రాంత్ ఉగ్ర‌రూపం – పాక్ కు చెందిన రెండు పోర్టులు, 12 యుద్ద నౌక‌లు మ‌టాష్

ఐఎన్ఎస్ విక్రాంత్ ఉగ్ర‌రూపం –
10 నిమిషాల‌లో పాక్ కు చెందిన రెండు పోర్టులు,
12 యుద్ద నౌక‌లు మ‌టాష్
టోమాహాక్ , బ్రహ్మోస్ క్షిప‌ణిల‌తో ధ్వంసం
ఆరేబియా మ‌హా స‌ముద్రంలో మ‌న బాహుబ‌లి
శ‌త్రుదుర్భేద్యంగా ‘కారియర్‌ బాటిల్‌ గ్రూప్‌’

న్యూ ఢిల్లీ – పాకిస్థాన్‌లోని కరాచీ పోర్ట్‌పై భారత నౌకాదళం గత రాత్రి క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడిలో కరాచీ పోర్ట్‌కు తీవ్ర నష్టం కలిగినట్టు సమాచారం. పోర్ట్‌లోని కొన్ని ముఖ్యమైన విభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో భారత నౌకాదళం నుంచి సముద్రంలో నుంచే అనేక టోమాహాక్ , బ్రహ్మోస్ తరహా క్షిపణులు ప్రయోగించబడ్డాయి. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ దాడి ప్రణాళికాబద్ధంగా నిర్వహించారు..

భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికా దళం. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా రెండు ఓడరేవులలో భారీ మంటలు చెలరేగాయి. ఈ దాడి కారణంగా, రెండు ఓడరేవు నగరాల చుట్టూ పొగ వ్యాపించింది. ఇది ఇలా ఉంటే ఈ దాడిలో క‌రాచీ ఓడ‌రేవు 60 శాతం ధ్వంస‌మైన‌ట్లు భార‌త్ అధికారులంటున్నారు.. అలాగే పాక్ కు చెందిన 12 యుద్ద నౌక‌లు కూడా ధ్వంస‌మ‌య్యాయి..

పాకిస్తాన్ నావికాదళానికి కరాచీ, ఒర్మారాలో స్థావరాలు ఉన్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు మోహరించిన చోటు ఇదే. ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడమే ల‌క్ష్యంగా భారత నావికాదళ ఆపరేషన్ నిర్వ‌హించింది..

శ‌త్రుదుర్భ‌ధ్యం ఐఎన్ ఎస్ విక్రాంత్ …

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధవాహక నౌకను వారం కిందటే భారత నౌకాదళం తరలించింది. అరేబియా సముద్రం తీర ప్రాంతంలోనే పాకిస్థాన్‌లోని కరాచీ నగరం ఉంది. పాకిస్థాన్‌ మీద దాడికి సిద్ధంగా ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. గురువారం కరాచీ మీద నిప్పులు కురిపించింది. ఈ నేపథ్యంలో,ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విశేషాలు..ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ బరువు 45 వేల మెట్రిక్‌ టన్నులు. పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 మిగ్‌ 29కే యుద్ధవిమానాలను నిలుపవచ్చు. ఒక్కో మిగ్‌ 800 కి.మీ.ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామోవ్‌-31 హెలికాప్టర్లను, యాంటీ సబ్‌మెరైన్‌ మిషన్‌ కోసం వాడే హాల్‌ ధ్రువ్‌ హెలికాప్టర్లనుఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్‌ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే బరాక్‌-8 క్షిపణులు, ఈఎల్‌/ఎం-2248 ఎంఎఫ్‌‌ -స్టార్‌ వంటి అత్యాధునిక రాడార్లు ఉంటాయి. ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ను శత్రు దుర్భేద్యంగా మార్చే ‘కారియర్‌ బాటిల్‌ గ్రూప్‌’ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్‌లో కల్వరి క్లాస్‌ జలాంతర్గాములు, కోల్‌కతా క్లాస్‌ డిస్ట్రాయర్లు, తల్వార్‌ క్లాస్‌ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. సముద్రంలో ఓ భారీకోటలా ముందుకు కదులుతుంది.

నిప్పులు చిమ్మే క్షిపణులు

కల్వరి క్లాస్‌ జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్‌ కల్వరి, ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సబ్‌మెరైన్లుంటాయి. వీటిలో శత్రునౌకలను ధ్వంసం చేసే క్షిపణులుంటాయి. ఒక క్షిపణి 3 వేల కిలోల బరువైన నౌకను కూడా తుత్తునియలు చేయగలదు. ఇక కోల్‌కతా క్లాస్‌ డిస్ట్రాయర్లలో బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిసైల్స్‌, 32 బరాక్‌-8 మిసైల్స్‌తో కూడిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధనౌకలుంటాయి. ఇవి పాకిస్థాన్‌లోని నౌకాశ్రయాలను, చమురు డిపోలను, యుద్ధనౌకలను లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు. తల్వార్‌ క్లాస్‌ ఫ్రిగేట్లలో ఐఎన్‌ఎస్‌ తల్వార్‌, ఐఎన్‌ఎస్‌ తేగ్‌, ఐఎన్‌ఎస్‌ త్రికాండ్‌ యుద్ధనౌకలుంటాయి. వీటిలో దాడికి సిద్ధంగా 8 బ్రహ్మోస్‌ క్షిపణులుంటాయి. వేగంగా కదులుతూ, తీరప్రాంతాల్లో దాడులు జరిపేందుకు, దాడికి అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రిగేట్లు ఉపయోగపడుతాయి.

Leave a Reply