Amaravati | వంద పాకిస్థాన్ లు వ‌చ్చినా మోడీ మిసైల్ ముందు మటాష్ – నారా లోకేష్

వెల‌గ‌పూడి – వంద‌ పాకిస్థాన్ లు వచ్చినా, దీటుగా బదులిచ్చేందుకు మన వద్ద ఒక్క మిస్సైల్ ఉంది… ఆ మిస్సైల్ పేరు నమో (నరేంద్ర మోదీ) అని మంత్రి లోకేశ్ అన్నారు. అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ మాట్లాడుతూ, “వారు భారతగడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. సింహం ముందు ఆటలు ఆడకూడదు… ఆడితే ఏమవుతుంది… మన నమో దెబ్బకు వరల్డ్ మ్యాప్ నుంచి పాకిస్థాన్ మిస్సింగ్ కావడం ఖాయం. ఈరోజ పాక్ ఆర్మీలో పనిచేసేవారు కొందరు రాజీనామాలు చేశారు, కొందరు సెలవు పెట్టి వెళ్లిపోయారు… నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్ దిమ్మదిరిగిపోవడం ఖాయం. ఇవాళ యావత్ దేశం మన నమో వెంట నిలుస్తోంది అని అన్నారు…

కుల‌గ‌ణ‌న నిర్ణ‌యం చారిత్రాత్మ‌కం ..

కేంద్రం ఇవాళ కులగణన చేయాలని నిర్ణయించింది. ఇది ఒక నిర్ణయం కాదు… ఇది ఒక సంచలనం అని అన్నారు లోకేష్. కులగణన చేయడానికి చాలామంది దశాబ్దాలుగా వెనుకాడుతుంటే, మన నమో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. నమోకు మన అమరావతి అంటే ఎంతో ప్రేమ. ఆయన ఢిల్లీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మన అమరావతి కోసం వచ్చారు. ఆయన ఏపీకి కావాల్సినవన్నీ అందిస్తున్నారు, కోరిన కోర్కెలు తీర్చుతున్నారు. మొన్ననే విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ, నక్కపల్లి డ్రగ్ పార్క్ కు నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇప్పుడు అమరావతి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు” అని లోకేశ్ వివరించారు.

Leave a Reply