మాసాయిపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: బొడ్డు గంగన్న
కడెం ఆంధ్రప్రభ : డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న ఆధ్వర్యంలో మాసాయిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నేరెల్ల రాజేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా కుంటాల నడిపి నర్సయ్య, జాడి లింగన్న, ప్రధాన కార్యదర్శిగా నాగిల్లా ఆశన్న, కోశాధికారిగా పిలి బుచ్చన్న, కార్యదర్శులుగా ఆరపల్లి నడిపి రాజన్న, నాగిల్లా అంజన్న, అధికార ప్రతినిధిగా నాలెం శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కుంటాల పెద్దనర్సయ్య, చిమల నర్సయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే వివిధ సెల్ అధ్యక్షులను కూడా ఎన్నుకున్నారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా తోట్ల ఓజన్న, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దర్శనాల చిన్న ఆశన్న, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా చిమల నర్సయ్య, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఎస్.కే. ఆరీఫ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు గంగన్న మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కడెం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముస్కు రాజేందర్, మండల కార్యదర్శి నరేష్, బీసీ సెల్ అధ్యక్షుడు ముంజా ప్రసాద్ గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం, స్థానిక గ్రామ సర్పంచ్ రాజవ్వ ఎర్రన్న, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రాజేష్, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
