ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా జట్టు జట్టు సమిష్టి కృషి కనబర్చింది. బ్యాటర్లంతా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబడుతూ.. కోల్కతా స్కోరు బోర్డుపై పరుగులు పెట్టించారు. దాంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది.
ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (12 బంతుల్లో 26), సునీల్ నరైన్ (16 బంతుల్లో 27)తో పాటు కెప్టెన్ అజింక్యా రహానే (14 బంతుల్లో 26) పరుగులు సాధించారు. ఇక మిడిలార్డర్ లో అంగ్క్రిష్ రఘువంశీ (32 బంతుల్లో 44), రింకూ సింగ్ (25 బంతుల్లో 36), ఆండ్రీ రస్సెల్ (9 బంతుల్లో 17) రాణించారు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో మెరిసాడు. అక్షర్ పటేల్, విప్రాజ్ నిగ్గమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. దుష్మంత చమీర ఒక వికెట్ తీశాడు. ఇక 205 పరుగుల విజయలక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ కు దిగనుంది.