Liquor Scam : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు

వెలగపూడి : మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈనెల 18న విజయవాడ సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొంది. వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా దర్యాప్తునకు సిట్ను ఏర్పాటు చేసింది.
