60 Days After : జపాన్ ఖుషీఖుషీ Andhra Prabha Top News
60 Days After : జపాన్ ఖుషీఖుషీ Andhra Prabha Top News
- వీడిన 60 రోజుల చెర
- 20 లక్షల బ్యారెళ్లతో… వీఎల్ సీసీ పరుగు
- హోర్మజ్ దాటిన ఇడెమిట్సు మారు
- మే 15 కు నాగోయా పోర్ట్కు ..
( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)
60 Days After : అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎథిక్ ప్యూరీ ఆరంభమైన 60 రోజున .. జపాన్ 20 లక్షల బ్యారెళ్ల సౌదీ ముడి చమురును తీసుకువెళ్తున్న ‘ఇడెమిట్సు మారు’ అనే జపాన్ ట్యాంకర్ హోర్ముజ్ జలసంధిని దాటింది. ఇరాన్ యుద్ధం ఆరంభం నుంచి ఈ సంధి దాటిన తొలి జపాన్ చమురు ట్యాంకర్ ఇదే.
ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ తో రగిలిన ఘర్షణ మధ్యప్రాచ్య చమురు, LNG సరఫరాలకు అంతరాయం కలగడానికి ముందు, జపాన్ తన ముడి చమురు దిగుమతులలో సుమారు 95 శాతాన్ని ఈ ఈ గల్ఫ్ ప్రాంతం నుంచే పొందేది, అందులో అధిక భాగం హోర్ముజ్ ద్వారానే జరిగేది.
60 Days After : వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ ఇడెమిట్సు మారు 20 లక్షల బారెళ్ల సౌదీ అరేబియా ముడి చమురుతో జపాన్ కు బయలుదేరింది. ఇరాన్ అధికారులు సూచించిన సురక్షిత ‘ఉత్తర మార్గం’ (క్యూష్మ్ లారక్ దీవుల మీదుగా) ఈ నౌక ప్రయాణించింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి జపాన్ చమురు ట్యాంకర్లేవీ ఈ జలసంధిని దాటలేదు. ఇంతకుముందు కేవలం మూడు సహజ వాయువు (LNG) వాహకాలు మాత్రమే దీనిని దాటాయి. ఈ ట్యాంకర్ మే నెల మధ్య నాటికి జపాన్లోని నాగోయా (Nagoya) ఓడరేవుకు చేరుకోవచ్చని అంచనా
