60 Days After : జపాన్​ ఖుషీఖుషీ Andhra Prabha Top News

60 Days After : జపాన్​ ఖుషీఖుషీ Andhra Prabha Top News

  • వీడిన 60 రోజుల చెర
  • 20 లక్షల బ్యారెళ్లతో… వీఎల్​ సీసీ పరుగు
  • హోర్మజ్​ దాటిన ఇడెమిట్సు మారు
  • మే 15 కు నాగోయా పోర్ట్‌కు ..

( ఆంధ్రప్రభ, టెహ్రాన్​ ప్రతినిధి)

60 Days After : అమెరికా ఇజ్రాయెల్​ ఆపరేషన్​ ఎథిక్​ ప్యూరీ ఆరంభమైన 60 రోజున .. జపాన్ 20 లక్షల బ్యారెళ్ల సౌదీ ముడి చమురును తీసుకువెళ్తున్న ‘ఇడెమిట్సు మారు’ అనే జపాన్​ ట్యాంకర్ హోర్ముజ్ జలసంధిని దాటింది. ఇరాన్ యుద్ధం ఆరంభం నుంచి ఈ సంధి దాటిన తొలి జపాన్ చమురు ట్యాంకర్ ఇదే.
ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్​ జాయింట్​ ఆపరేషన్​ తో రగిలిన ఘర్షణ మధ్యప్రాచ్య చమురు, LNG సరఫరాలకు అంతరాయం కలగడానికి ముందు, జపాన్ తన ముడి చమురు దిగుమతులలో సుమారు 95 శాతాన్ని ఈ ఈ గల్ఫ్​ ప్రాంతం నుంచే పొందేది, అందులో అధిక భాగం హోర్ముజ్ ద్వారానే జరిగేది.

60 Days After : వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ ఇడెమిట్సు మారు 20 లక్షల బారెళ్ల సౌదీ అరేబియా ముడి చమురుతో జపాన్​ కు బయలుదేరింది. ఇరాన్ అధికారులు సూచించిన సురక్షిత ‘ఉత్తర మార్గం’ (క్యూష్మ్ లారక్ దీవుల మీదుగా) ఈ నౌక ప్రయాణించింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి జపాన్ చమురు ట్యాంకర్లేవీ ఈ జలసంధిని దాటలేదు. ఇంతకుముందు కేవలం మూడు సహజ వాయువు (LNG) వాహకాలు మాత్రమే దీనిని దాటాయి. ఈ ట్యాంకర్ మే నెల మధ్య నాటికి జపాన్‌లోని నాగోయా (Nagoya) ఓడరేవుకు చేరుకోవచ్చని అంచనా