హైదరాబాద్ : విద్యా రంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ నాయకులు ఇవాళ తెలంగాణ అసెంబ్లీని ముట్టడించారు. ఈ నేపథ్యంలో వారంతా అసెంబ్లీ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ.. వీసీ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 15నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు విద్యా శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక గురుకులాల్లో మరణించిన విద్యార్థులకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు.