మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. జూబ్లీహిల్స్ లోని డీకే అరుణ ఇంట్లోకి శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు.
సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి, వంటగది కిటికీని తొలగించి దుండగుడు ఇంట్లోకి ప్రవేశించాడని తెలిసింది. ఇంట్లోని వంటగది, హాలు, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ వెతికాడు.
దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే ఈ విషయం గురించి డికె అరుణకు సమాచారం అందించారు. డికె అరుణ అప్రమత్తమై వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు, వారు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆగంతకుడు ఇంట్లోకి చొరబడిన సమయంలో డీకే అరుణ అక్కడ లేనట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.