Srisailam | మహాశివరాత్రికి పటిష్ట భద్రత భద్రత ఏర్పాట్లు..

  • భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు
  • నంద్యాల జిల్లా ఇంచార్జ్ ఎస్పి విక్రాంత్ పాటిల్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను నంద్యాల ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీశైలం దేవస్థానంలోని క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, లడ్డూ కౌంటర్, శివ స్వాముల క్యూ లైన్, స్నాన ఘట్టాలు, శ్రీకృష్ణదేవరాయల గోపుర పరిసర ప్రాంతాలు, రథ మండపం, కమాండ్ కంట్రోల్, శ్రీశైల డ్యాం సమీపంలోని ఘాట్ రోడ్డు.. మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎస్పీ మాట్లాడుతూ… శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎస్పీతో పాటు నంద్యాల జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, ఇన్ స్పెక్టర్లు మోహన్ రెడ్డి, ప్రసాదరావు, చంద్రబాబు, సురేష్ కుమార్ రెడ్డి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *