HYD| ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం..

విద్యార్థుల బైఠాయింపు
సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్

ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం భోజ‌నం బంద్ పెట్టిన విద్యార్థులు… యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం వ‌ద్ద బైఠాయించారు.

ఈ సందర్భంగా పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *