Remanded | విజ‌య‌వాడ కేసులోనూ పోసానికి 14 రోజుల రిమాండ్

విజయవాడ సీఎంఎం కోర్టు ఈనెల 20 వరకూ రిమాండ్ విధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా కూటమి నేతలు, మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ ఖైదీగా కర్నూల్ జైలులో ఉన్న పోసానిని ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. దీంతో ఆయన్న మళ్లీ కర్నూలు జైలుకు తరలించనున్నారు.

అన్ని అక్ర‌మ కేసులే …

అయితే విచారణ సందర్భంగా తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి పోసాని తెలిపారు. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలూ తిప్పుతున్నారని చెప్పారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని విన్నవించారు. గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయని బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. మరోవైపు పోసాని దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *