న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు.. ఈనెల 18, 19 తేదీల్లో ఆమె ఆ రాష్ట్రంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక రాష్ట్రపతి 18న స్థానిక కళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి కొట్టాయం జిల్లాకు చేరుకుంటారు. ఆ మరుసటి రోజు, మే 19న ఆమె ఎడవం మాస పూజల ముగింపు రోజున ప్రార్థనలు చేయడానికి శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి శబరిమలకు వెళ్లనున్నారు.
Delhi | ఈనెల 19న శబరిమలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
