June 9 | శ్రీలంక పర్యటనకు ఇండియా-ఎ జట్టు

June 9 | శ్రీలంక పర్యటనకు ఇండియా-ఎ జట్టు
June 9 | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న ఇండియా-ఎ జట్టును Board of Control for Cricket in India (బీసీసీఐ) ప్రకటించింది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు సిరీస్లో భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్-ఎ జట్లు తలపడనున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశమిస్తూ బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది.
ఈ సిరీస్కు తిలక్ వర్మను కెప్టెన్గా నియమించగా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జట్టులో ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్, హర్ష్ దూబె వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.

వికెట్ కీపర్లుగా ప్రభసిమ్రన్ సింగ్, కుమార్ కుశాగ్ర ఎంపికయ్యారు. అలాగే విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుద్వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్ వంటి బౌలర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ యువ ఆటగాళ్ల ప్రతిభను నిరూపించుకునే వేదికగా నిలవనుంది.
click here to read more : 8 teams| ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేస్ రసవత్తరం
