నాటు సారా వద్దు – అభివృద్ధి ముద్దు

నాటు సారా వద్దు – అభివృద్ధి ముద్దు

షికారి పేటకు కలెక్టర్ వరాల జల్లు
ఒక్క రోజులో మారిన షికారి పేట ముఖచిత్రం రూ.45 లక్షలతో అభివృద్ధి, ఉద్యోగాలకు భరోసా
సారా కాదు, సంక్షేమం కావాలి నందికొట్కూరులో అధికారుల సమగ్ర అవగాహన సదస్సు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : కలెక్టర్ రాజకుమారి గనియ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం షికారి కాలనీ అభివృద్ధికి రూ.45 లక్షలు మంజూరు నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ముందడుగు వేసింది. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ ఆదేశాలు, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్. రవికుమార్ సూచనల మేరకు ఈరోజు నందికొట్కూరు షికారి పేటలో ‘నాటు సారా నిర్మూలన కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు తాసిల్దార్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి. రాముడు శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి ఎస్సై లు చంద్రశేఖర్ జఫరుల్లా మెప్మా అధికారి ప్రమీల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో అన్ని శాఖల అధికారులు పాల్గొని షికారి వాసులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. షికారి పేటలో రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరయ్యాయని ప్రకటించారు.

కాలనీలో ఏ సమస్య ఉన్నా సోమవారం తమ కార్యాలయానికి వస్తే తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీలి షికారి ప్రజలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రేషన్ లేదా ఇతర సమస్యలపై అర్జీ ఇస్తే వెంటనే పరిష్కార మార్గం చూస్తామని సభాముఖంగా వెల్లడించారు అదేవిధంగా యువతకు ఉద్యోగ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. షికారి కాలనీ యువత కోసం కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తామే అందజేస్తామని అని అన్నారు యువతలో ఉత్సాహం నీకెందుకు నూతన ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు మహిళలకు మెప్మా ద్వారా రుణ సదుపాయం ప్రతి సోమవారం కాలనీకి వచ్చి మహిళలతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇప్పిస్తామని తెలిపారు.

తోపుడు బండి, చిన్న వ్యాపారులైన పురుషులకు కూడా రుణ సదుపాయం కల్పిస్తామని అని అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చదువుకున్నవారికి ఉద్యోగ కల్పన, నిరక్షరాస్యులకు మెప్మా ద్వారా సహాయం అందిస్తామన్నారు. యువత కోసం రింగ్ బాల్, వాలీబాల్ వంటి క్రీడా వస్తువులను తమ శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందని అని అన్నారు నాటు సారాను వదిలి అభివృద్ధి బాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply