Cricket | స్మార్ట్ సన్గ్లాసెస్ వినియోగించొద్దని బీసీసీఐ ఆదేశం
Cricket | స్మార్ట్ సన్గ్లాసెస్ వినియోగించొద్దని బీసీసీఐ ఆదేశం
Cricket | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో స్మార్ట్ సన్గ్లాసెస్ వినియోగంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆంక్షలు విధించినట్లు తెలిసింది. లైవ్ స్ట్రీమింగ్, టెక్స్ట్ మెసేజింగ్, ఆడియో-వీడియో కాలింగ్ వంటి ఫీచర్లు కలిగిన స్మార్ట్ వేర్బుల్ గ్లాసెస్ను మ్యాచ్ సమయంలో వినియోగించకూడదని సూచనలు జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల మ్యాచ్ గోప్యత మరియు డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే స్మార్ట్ సన్గ్లాసెస్ వినియోగంపై అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.
