Commissioner | పోలీస్ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం
Commissioner | పోలీస్ శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం
Commissioner | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. తెలంగాణ డీజీపీగా చార్జ్ తీసుకున్న సీవీ ఆనంద్ పోలీస్ యంత్రాంగంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. భారీ సంఖ్యలో సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 65 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు.
