సింగపూర్లో చదువుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్, చిరంజీవి, చిరంజీవి భార్య మార్క్ శంకర్ ని చూడటానికి సింగపూర్ వెళ్లారు. గత మూడు రోజులుగా మార్క్ శంకర్ హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకున్నాడు.
మార్క్ శంకర్ గత మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి, చిరంజీవి భార్య సురేఖ మార్క్ శంకర్ ని చూడటానికి సింగపూర్ వెళ్లారు. కాగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ట్వీట్ చేశారు.
‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి మా బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అంటూ చిరు తన ట్వీట్ లో పేర్కోన్నాడు.