దుబాయ్ – చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ జోష్ ఇంగ్లిస్ రూపంలో కోల్పోయింది.. 11 పరుగులు చేసిన ఇంగ్లీస్ ను జడేజా పెవిలియన్ కు చేర్చాడు. ఈ మ్యాచ్ లో జడేజాకు ఇది రెండో వికెట్ .. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లబూషేన్ 29 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో మూడో వికెట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. అంతకు ముందు వరుణ్ చక్రవర్తి తొలి ఓవర్ లోనే ట్రావీస్ హెడ్ ను రెండో వికెట్ కి పెవిలియన్ కు పంపించాడు. 39 పరుగులు చేసిన ట్రావీస్ హెడ్ వరణ్ బౌలింగ్ లో గిల్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు..ఇక ఇండియాతో జరుగుతున్న సెమీస్ మ్యాచ్ లో ఆదిలోనే ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బతగిలింది.. కూపర్ సున్నా పరుగులకే షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు.. ఈ వికెట్ షమీకి లభించింది.. ఇక తొలి ఓవర్ లోనే ట్రావిస్ హెడ్ లైఫ్ లభించింది. షమీ తన బౌలింగ్ లోనే రిటర్న్ క్యాచ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ప్రస్తుతం స్మీత్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా అలక్సీ క్యారీ లు క్రీజ్ లో ఉన్నాడు. ఆసీస్ 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
అయిదుగురు స్పిన్నర్లతో ఆసీస్
ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.. ఏకంగా అయిదుగురు స్పిన్నర్ లతో బరిలోకి దిగింది. భారత్ కు ఎదుర్కొనేందుకు స్పిన్ తంత్రాన్ని ప్రయోగించనుంది. నలుగురు స్పిన్నరలతో బరిలోకి దిగి న్యూజిల్యాండ్ పై విజయం సాధించిన ఇండియా టీమ్ ను స్ఫూర్తిగా తీసుకున్న ఆసీస్ ఇప్పుడు అదే స్పిన్ తంత్రాన్ని మనపై ప్రయాగించేందుకు సిద్దమైంది. జంపా, తన్వీర్, కూపర్, మ్యాక్స్వెల్ లో లబుషేన్ తో కూడా స్పిన్ బౌలింగ్ చేయించనుంది.. మన కంటే ఒక స్పిన్నర్ ను అదనంగానే జట్టులోకి తీసుకుంది. ఇక టీమ్ ఇండియా జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు..
ఆసీస్ జట్టు – కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా
భారత్ జట్టు – రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ.