సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్లోని (kodada Bypass) దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (accident) చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు (car) , ఆ ప్రాంతంలో నిలిచివున్న లారీని ( lorry ) వెనుక నుండి ఢీకొట్టింది. (Collision)
ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులను ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్ఐ అశోక్ ( si ashok ) , కానిస్టేబుల్ స్వామిగా (constable Swamy) గుర్తించారు. ప్రమాద సమయంలో వారు కారు ప్రయాణిస్తున్నారు.
గాయపడిన ఇద్దరిని స్థానికులు , పోలీసులు కలిసి కారులో నుంచి బయటకు తీసి, తక్షణమే కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదానికి ప్రధాన కారణాలు వేగం , నిద్రమత్తుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.
!