Oxford school | హస్తలేఖనం మెరుగుపడితే మార్కులు మెరుగవుతాయి

Oxford school | హస్తలేఖనం మెరుగుపడితే మార్కులు మెరుగవుతాయి

Oxford school | అర్మూర్, ఆంధ్ర ప్రభ : ఆర్మూర్ పట్టణ శివారులో గల గాంధీ నగర్ లోని ఆక్స్ఫర్డ్ పాఠశాల(Oxford school)లో చేతిరాత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ శిబిరం 10 రోజులపాటు కొనసాగుతుందని పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ తెలిపారు. శిక్షణ శిబిరానికి బోధకులుగా ప్రముఖ చేతిరాత నిపుణులు డోంగరి రమేష్(Dongari Ramesh) హాజరై మాట్లాడుతూ…పరీక్షలు రాసేటప్పుడు చేతిరాత అందంగా కనబడితే మార్కులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు.

మంచి చేతిరాత వల్ల ఏకాగ్రత ఆత్మవిశ్వాసం ఆలోచన స్పష్టత పెరుగుతాయని అన్నారు. చేతిరాత సాధన ద్వారా మెదడు సమన్వయం జ్ఞాపకశక్తి సహనం పెరుగుతాయని, వాటితో పాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. సరైన విధానంలో క్రమమైన అభ్యాసం చేస్తే అందరు విద్యార్థులు అందంగా రాయగలరని, తెలివి ఎక్కువగా ఉన్న విద్యార్థులు(students) తక్కువగా ఉన్న విద్యార్థులు అనే తేడా లేకుండా చేతిరాత ఒక అభ్యాసంతో అభివృద్ధి చెందే నైపుణ్యమని పేర్కొన్నారు.

విద్యార్థులు రాసేటప్పుడు కూర్చునే విధానము పెన్ను పట్టుకునే తీరు అక్షరాల మధ్య అంతరం అక్షర నిర్మాణం పై దృష్టి పెట్టె విధానంపై మెలకువలను నేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇలాంటి నైపుణ్యాలు అభివృద్ధి(Development) చెందే కార్యక్రమాలు పాఠశాలలలో నిరంతరంగా చేపడుతామని ఆయన అన్నారు. ఈ చేతిరాత శిబిరం పది రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిని పద్మ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply