RTC | పాఠశాల స్థాయిలోనే బలమైన పునాది
- ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు

RTC | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : పాఠశాల (School) స్థాయిలో విలువలతో కూడిన విద్య అభ్యసించినప్పుడు బలమైన పునాది ఏర్పడుతుందని ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. అనంతపురం కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టీచర్స్ ప్రోగ్రామ్కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. వారు రూపొందించిన వివిధ ఫార్ములాలను పరిశీలించారు. కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ చైర్ పర్సన్ స్వప్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



