WGL | మానవత్వం చాటుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూరునగర్ మైసమ్మ దేవాలయం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపల్లికి వెళ్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రమాదాన్ని గమనించి, తన వాహనం నుండి దిగి, గాయపడ్డ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి క్షతగాత్రుడిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.

మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఫోన్ లో డాక్టర్ కు సూచించారు. ఆపదలో ఎమ్మెల్యే చూపిన చొరవకు అక్కడున్న స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *