MLA | ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు.
MLA | పెద్దమందడి, ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి శాసన సభ్యులు (MLA) తూడి మేఘారెడ్డి (Thudi Megha Reddy) అన్నారు. ఈ రోజు పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రైతుల ధాన్యాన్ని లారీలలోకి ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఏం సమస్యలున్నా కొనుగోలు కేంద్రంలోనే పరిష్కరించి ధాన్యాన్ని తీసుకోవాలని మిల్లర్లతో రైతుల(farmers)కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని ఆయన అన్నారు. మిల్లర్ల(Millers)పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ సిద్దయ్య, మధిర శ్రీశైలం. అల్వాల మాజీ ఉప్పల్ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి.ఎంపీడీవో , ఎమ్మార్వో పాండు నాయక్ , ఏపీఎం సక్కుర్ నాయక్ , మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరకు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి నాణ్యమైన భోజనం అందించాలి…

