జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు

జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. కల్తీ మద్యం కేసులో ఏ1 జనార్థన్ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆరేపల్లి రామును అదుపులోకి తీసుకుని భవానీపురం పీఎస్ కు తరలించారు. అయితే.. ఈ విషయం తెలిసి జోగి రమేష్ ఇంటికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
