ఆర్.ఆర్.బీ, గ్రూప్ డీ మాక్ టెస్ట్ కు విశేష స్పందన

ఆర్.ఆర్.బీ, గ్రూప్ డీ మాక్ టెస్ట్ కు విశేష స్పందన

  • 244 మంది అభ్యర్థుల హాజరు.
  • రామ్మోహన్ నాయుడుకు విద్యార్థులు థ్యాంక్స్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan Naidu) చేపట్టిన ప్రతిష్టాత్మక ఎర్రన్నవిద్యా సంకల్పం కార్యక్రమంలో ఆదివారం ఆర్.ఆర్.బీ, గ్రూప్ డీ(RRB, Group D) అభ్యర్ధుల కోసం నిర్వహించిన కంప్యుటర్ బేస్డ్ మాక్ టెస్ట్(Computer Based Mock Test)కు విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య కళాశాలలో ఆదివారం జరిగిన మాక్ టెస్ట్ కు హాజరైన అభ్యర్థులు పరీక్ష నిర్వహణ తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.


ఆర్.ఆర్.బీ, గ్రూప్ డీ ప్రధాన పరీక్షకు సన్నద్ధం చేసే దిశగా మాక్ టెస్ట్ ను నిర్వహిస్తున్నామని, ఇందుకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కొద్ది రోజుల క్రితం నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. ప్రకటన వెలువడటమే తరువాయి.. వెల్లువలా రిజిస్ట్రేషన్లు(Registrations) పోటెత్తాయి.. ఇందుకోసం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు అత్యంత పకడ్బందీగా ఆదివారం ఈ కంప్యుటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు.

ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి చేరువ చేసే మార్గాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గర చేస్తున్నారు. డీఎస్పీ(DSP), గ్రూప్స్, కానిస్టేబుల్, ఆర్.ఆర్.బీ ఇలా పోటీ పరీక్షలు అన్నింటికీ సమాయత్తం అయ్యేలా యువతను సన్నద్ధం చేస్తున్నారు.

ఇందు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం యువత తరలి వస్తున్నారు. మాక్ టెస్ట్లు నిర్వహించడం, అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్(Material) అందివ్వడం, నిష్ణాతులతో తరగతులు చెప్పించడం, పరీక్షకు సన్నద్దమయ్యేలా తీర్చిదిద్దే భాద్యత ఎర్రన్న(Erranna)సంకల్పం చేపట్టింది. సత్ఫలితాల సాధన దిశగా కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది.

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో ఎర్రన్న విద్యా సంకల్పం విద్యార్ధులు స్పష్టమైన ఫలితాలు సాధించడం ఇందుకు నిదర్శనంగా మారుతోంది.
తాజాగా ఆదివారం రోజున జరిగిన కంప్యుటర్ బేస్డ్ మాక్ టెస్ట్ లో మొత్తంగా 244 మంది విద్యార్ధులు పాల్గొన్నారు.

ఆర్.ఆర్.బీకి తీసిపోని స్థాయిలో పరీక్షను నిర్వహించారని, ప్రశ్నాపత్రం(Question Paper) కూడా ఆర్.ఆర్.బీ స్థాయి విలువలతో ఉందని తెలిపారు. ప్రధాన పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి ఈ మాక్ టెస్టులు ఉపయుక్తంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరీక్షను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

Leave a Reply