ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక (Sri Krishna Janmashtami celebration)ల్లో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్ రామాంతపూర్లోని గోకులే నగర్ (Gokule Nagar, Ramantapur)లో కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రథం ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కనే పెట్టారు యువకులు. రథాన్ని చేతులతో ముందుకు లాగుతూ తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పైన ఉన్న విద్యుత్ తీగలు (Power lines) రథానికి తగిలి ప్రమాదం జరిగిందన్న మాట విన్పించింది. దీంతో.. రథాన్ని లాగుతున్న 9 మంది యువకులు కరెంట్ షాక్తో పక్కకు పడిపోయారు. హుటాహుటిన స్థానికులు వారందర్నీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ఐదుగురు మృతి (five dead) చెందినట్లు తేల్చారు డాక్టర్లు. మరో నలుగురికి వైద్య చికిత్స అందించారు. కానీ, అందులో మరో వ్యక్తి సైతం మృతి చెందాడు. దీంతో ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే రథం తీస్తున్న సమయంలో టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్టిరకల్ లైన్స్తో కాంటాక్ట్ అయిందని వెల్లడించారు. అందువల్లే ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారాయన. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వంతో చర్చించి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. నిర్లక్ష్యం ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎండీ ముషారఫ్ అలీ. నిన్న రాత్రి వర్షం పడుతున్న వేళ ప్రమాదం జరిగిందన్నారు మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి. ఎలక్ట్రిక్ వైర్కు, టీవీ కేబుల్ వైర్ వేలాడుతోందని.. దాన్నుంచి కరెంట్ పాసై షాక్ తలిగిందన్నారు. దీంతో.. ఆ రథాన్ని లాగుతున్న వాళ్లు పడిపోయారన్నారు ఏసీపీ చక్రపాణి. రామాంతపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఆయన.. ఈ మొత్తం ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు. ప్రభుత్వం తరఫున బాధితులను ఆదుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు. న్యాయం జరిగే వరకు తాము ఇక్కడి నుంచి కదలమన్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. గోఖలే నగర్లో కొత్తగా ఏం విద్యుత్ సమస్యలు కాదని, ఎప్పటి నుంచో ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎలాగైనా వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.