AP |కాపవరంలో నేడు పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అమరావతిలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం బయలుదేరి 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.45 గంటలకు మలకపల్లికి చేరుకోనున్నారు. 10.45 నుంచి 11.05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దే ఆయన నగదు పంపిణీ చేయనున్నారు.

ఉదయం 11.10 నుంచి మ.12.40 వరకు గ్రామ సభలో పాల్గొని లబ్దిదారులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం ఏ.ఎమ్.సికి ఆయన చేరుకుంటారు. తర్వాత 1. 30 గంటల నుంచి మ. 3.00 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.

అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు సీఎం చేరుకుని బెంగళూరు బయలుదేరి వెళ్లారు .

Leave a Reply