RAW | ‘రా’ కొత్త చీఫ్​గా పరాగ్ జైన్ – రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న జైన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నూతన అధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం జూన్ 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. జూలై 1 నుంచి పరాగ్ జైన్ రెండేళ్ల పాటు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. 1989 బ్యాచ్‌కు చెందిన పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్, గతంలో పంజాబ్ డీజీపీగా కూడా సేవలు అందించారు. 2021 జనవరి 1న ఆయన డీజీపీ హోదా పొందారు. ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ జూన్ 2న ఆమోదముద్ర వేసింది. గూఢచార వర్గాల్లో పరాగ్ జైన్‌కు ‘సూపర్ స్లూత్’ అనే పేరుంది.

Leave a Reply