జన్నారం, జూన్ 9(ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని జన్నారం రేంజ్ ఆఫీసర్ (Range Officer)గా లక్ష్మీనారాయణ సోమవారం మధ్యాహ్నం కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ కార్యాలయంలో విధుల్లో చేరారు. లక్ష్మీనారాయణ (Lakshminarayana) గతంలో ఇక్కడ ఆరు నెలలు రేంజు ఆఫీసరుగా పనిచేసి సెలవుపై వెళ్లారు.
ఆ తర్వాత ఇంచార్జి రేంజు ఆఫీసర్ గా ఇందనపల్లి రేంజ్ ఆఫీసర్ హఫీజోద్దీన్ వ్యవహరించారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ మళ్లీ విధుల్లో చేరి, ఆ తర్వాత సెలవుపై వెళ్లి గ్రూప్ -1 ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యారు. ఈ తరుణంలో తాళ్లపేట రేంజ్ ఆఫీసర్, జన్నారం ఇన్చార్జి వి.సుష్మారావు (Sushma Rao) ఇంతకాలం జన్నారం ఇన్చార్జి బాధ్యతలను నిర్వర్తించారు. గ్రూప్ -1 (Group-1) లో ఉద్యోగం రాకపోవడంతో మళ్లీ గతంలో ఉన్న జన్నారం రేంజ్ ఆఫీసర్ పోస్టింగ్ లోనే లక్ష్మీనారాయణ చేరాలనుకున్నారు. ఈ మేరకు కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ కార్యాలయంలో సీసీఎఫ్ ప్రభాకర్ ను కలిసి మధ్యాహ్నం విధుల్లో చేరారు. రెండు రోజుల్లో జన్నారం రేంజ్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు.