కర్నూలు బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షణలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి 9 గంటల ఇవాళ నుండి 11 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ లు, బార్డర్ చెక్ పోస్టులు అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలకు అనుమానాస్పద వ్యక్తులు కానీ, కొత్తగా ఎవరైనా వ్యక్తులు తారసపడితే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని లాడ్జీ నిర్వహకులకు పోలీసు అధికారులు తెలియజేశారు.