TG |కరీంనగర్ లో భూప్రకంపనలు..

కరీంనగర్ ఆంధ్రప్రభ కరీంనగర్ జిల్లా కేంద్రంలో భూమి ఒక్కసారిగా కనిపించడంతో జనం ఇండ్ల నుండి పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం 6:52 నిమిషాలకు భూమి ఒక్కసారిగా పంపించింది. ఐదు సెకండ్ల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో జనం భయంతో ఇండ్ల నుండి పరుగులు తీశారు. అయితే శాస్త్రీయంగా ఎంత మేర భూమి కంపించిందనివిషయం తెలియాల్సి ఉంది.

ఉత్తర తెలంగాణలోనూ..

ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్‌, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, కడెం మండలాల్లో 10 సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.

ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు

గోలేటి సమీపంలో పులికుంట కేంద్రంగా భూకంపం

ఈరోజు సాయంత్రం గం. 6:50:22 ని. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా కంపించిన భూమి. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతో పాటు జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాలలోని పలుప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది. భూకంప తీవ్రత 3.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారిక వెబ్సైట్‌లో పేర్కొన్నది‌.

Leave a Reply