వికారాబాద్ ఏప్రిల్ 27 ( ఆంధ్రప్రభ): వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బీఆర్ఎస్ భవన్ (జిల్లా పార్టీ కార్యాలయం) లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి పార్టీ ఆవిర్భవించి 25 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగబోయే రజతోత్సవ సభ కు బయలుదేరిన వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. ఈ సందర్భంగా డాక్టర్ అనంత మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరంన్నర కావస్తున్న ఇప్పటివరకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మేక చంద్రశేఖర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి గండ్ల మల్లికార్జున్ గయ జుద్దీన్ తదితరులు పాల్గొన్నారు
బంటారం లో బిఆర్ఎస్ జెండా ఎగుర వేసిన మల్లేశం

వికారాబాద్/బంటారం :చలో వరంగల్ కార్యక్రమం లో బాగముగా ఆది వరం ఉదయం బంటారం మండల కేంద్రం లో మండల బీఆర్ఎస్ ఆధ్యకులు దుర్గం చెరువు మల్లేశం పార్టీ జెండా ను ఎగుర వేసి వరంగల్ కు బయలు దేరారు..పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.