AP | గుజరాత్ ప‌ర్య‌ట‌న‌కు మంత్రి నారాయణ !

ఆంద్ర‌ప్రదేశ్ పట్టణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ రేప‌టి నుంచి రెండు రోజుల‌పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి నారాయణ వెంట సీఆర్డీఏ కమిషనర్, ఏడీసీ, గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు ఉంటారు. అమరావతి నిర్మాణం కోసం మంత్రి నారాయణ, ఆయన బృందం అధ్యయనం చేయనున్నారు.

రేపు (ఏప్రిల్ 20) మంత్రి నారాయణ బృందం ఏక్తానగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించనుంది. పటేల్ విగ్రహం చుట్టుపక్కల ప్రాంతాలను మంత్రి బృందం అధ్యయనం చేస్తుంది. వారు అహ్మదాబాద్ శివార్లలోని గిఫ్ట్ సిటీని పరిశీలించనున్నారు.

యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీని సందర్శించనున్నారు. అనంతరం, రేపు రాత్రి అహ్మదాబాద్ లోని స్పోర్ట్స్ సిటీని పరిశీలించనున్నారు. మంత్రి నారాయణ బృందం ఎల్లుండి ఏప్రిల్ 21న సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *