Venkatapalem | శ్రీవారి క‌ల్యాణానికి చంద్ర‌బాబుకు ఆహ్వానం ..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే శ్రీనివాస క‌ల్యాణానికి రావాల‌సిందిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కి టిటిడి ఆహ్వానించింది.. టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లిలో సిఎం నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రికి స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రిక‌ను ఆంద‌జేశారు.. అమరావతిలోని వెంకటపాలెంలో రేపు జరగనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి రావాలని కోరారు. వెంకటపాలెంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణం ఏర్పాట్ల గురించి నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు చంద్ర‌బాబు సూచించారు.
ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబుకు స్వామివారి ప్రసాదం అందజేశారు. కాగా, చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీ పాలకమండలి సభ్యులు, టీటీడీ ఈవో, జేఈవో కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *