9000 HP | భారతీయ రైల్వేలో సరికొత్త శకం..

9000 HP | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: భారతీయ రైల్వే సరుకు రవాణా రంగంలో ఒక భారీ మైలురాయి నమోదైంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన 9000 HP (హార్స్‌పవర్) సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఫ్రైట్ లోకోమోటివ్‌ల మొదటి సెట్‌ను సీమెన్స్ (Siemens) సంస్థ వాణిజ్య కార్యకలాపాల కోసం భారతీయ రైల్వేకు అప్పగించింది. ఒప్పందం కుదిరిన కేవలం 36 నెలలలోపే ఈ శక్తివంతమైన ఇంజన్లను డెలివరీ చేసి, సీమెన్స్ సరికొత్త రికార్డు సృష్టించింది యూరోపియన్ స్టాండర్డ్ (EN 14363) ప్రకారం ధృవీకరించబడిన భారతీయ రైల్వే యొక్క మొట్టమొదటి రోలింగ్ స్టాక్‌గా D9 – 9000 HP లోకోమోటివ్‌లు నిలిచాయి. ఈ లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం విశాఖపట్నంలో మొదటి మెయింటెనెన్స్ డిపో ప్రారంభమైంది.

9000 హార్స్‌పవర్ (HP) సామర్థ్యంతో ఎలక్ట్రిక్ ఫ్రైట్ లోకోమోటివ్‌ల వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడంతో, భారతీయ రైల్వే తన రైలు సరుకు రవాణా ఆధునీకరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. భారీ సరుకు రవాణా కార్యకలాపాల కోసం రూపొందించబడిన ఈ లోకోమోటివ్‌లు గంటకు 120 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్రైట్ లోకోమోటివ్‌లలో ఒకటిగా నిలుస్తున్నాయి. ఒప్పందం కుదిరిన నాటి నుండి 36 నెలలలోపే ఈ లోకోమోటివ్‌లు వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడం రికార్డు స్థాయిలో అమలు జరిగింది. భారతీయ రైల్వే రంగంలో ఈ స్థాయి ప్రాజెక్టుకు సంబంధించి ఇది అత్యంత వేగవంతమైన డెలివరీలలో ఒకటి.

ఈ ప్రాజెక్టును దీర్ఘకాలిక లభ్యత, ఆధారిత లైఫ్‌సైకిల్ భాగస్వామ్య నమూనా కింద అమలు చేస్తున్నారు. ఇందులో డిజైన్, తయారీ, కమిషనింగ్, మరియు 35 సంవత్సరాల పూర్తిస్థాయి సర్వీస్ నిర్వహణ ఉంటాయి. గుజరాత్‌లోని దాహోద్‌లో ఉన్న భారతీయ రైల్వే ఫ్యాక్టరీలో ఈ లోకోమోటివ్‌లను తయారు చేస్తుండగా, విశాఖపట్నం, రాయ్‌పూర్, ఖరగ్‌పూర్, మరియు పూణేలోని డిపోలలో నిర్వహణ జరుగుతుంది. ఇది నిరంతర పనితీరుకు, అధిక ఫ్లీట్ లభ్యతకు మద్దతు కూడా ఇస్తుంది.

సిమెన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మాథుర్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వేకు దీర్ఘకాలంగా, విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న సిమెన్స్‌కు ఇది గర్వకారణమన్నారు. ఒక మార్గదర్శక భాగస్వామ్యం, పటిష్టమైన లైఫ్‌సైకిల్ బిజినెస్ మోడల్ ద్వారా సాధ్యమైన ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల విజయవంతమైన అప్పగింత, రైలు ఆధునీకరణలో ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిందని, ఇది భారతీయ రైల్వే, సిమెన్స్ మధ్య సహకార బలాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తూ.. ఈ విజయాన్ని సాధ్యం చేసిన వారికి ఒక నిదర్శనంగా నిలుస్తుందన్నారు.

లోకోమోటివ్ టెక్నాలజీలలో సుమారు 90% భారతదేశంలోనే తయారయ్యాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ పట్ల భారతీయ రైల్వే, సిమెన్స్‌ల ఉమ్మడి నిబద్ధతను, అలాగే పటిష్టమైన దేశీయ రైలు తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ భారతీయ సరఫరాదారులు, తయారీ కేంద్రాలు మరియు నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల సామర్థ్య నిర్మాణానికి కూడా దోహదపడింది.

9,000 HP శక్తి గల ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు, సిమెన్స్ వారి ఇంటెలిజెంట్ రైల్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన రైలిజెంట్ ఎక్స్‌తో సహా అధునాతన డిజిటల్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి. ఇవి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, డేటా-ఆధారిత పనితీరు ఆప్టిమైజేషన్‌ను సాధ్యం చేస్తాయి. ఈ లోకోమోటివ్‌లు అధునాతన భద్రత, పర్యవేక్షణ సాంకేతికతలను అనుసంధానించాయి. భారతీయ రైల్వే నెట్‌వర్క్ అంతటా శక్తి సామర్థ్యంతో, అధిక విశ్వసనీయతతో సరుకు రవాణా కార్యకలాపాలకి ఇవి రూపొందించబడ్డాయి. వాటి జీవితకాలంలో లోకోమోటివ్‌లు దేశం విస్తృత వాతావరణ, లాజిస్టిక్స్ సామర్థ్య లక్ష్యాలకు మద్దతునిస్తూ.. సుస్థిరత ఫలితాలకు గణనీయంగా దోహదపడతాయని భావిస్తున్నారు.