వరంగల్ – వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.. ముందుగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల అధికారులు నిర్వహించిన పెరేడ్ లో పాల్గోని గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవం, జిల్లా ప్రగతిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో అమరులైన వారి కుటుంబాలను సత్కరించారు, భాదాతప్త హృదయంతో అమర వీరుల కుటుంబ సభ్యులు వారిని గుర్తు చేసుకుని చలించి పోతే వారిని ఓదార్చి పరామర్శించి, ప్రభుత్వం వారికి అండగా ఉంటదని భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి.
వరంగల్ జిల్లా అధికారులు పట్టణ అభివృద్ధి, పథకాలపైన తయారు చేసిన శకటాలు, ఏర్పాటు చేసిన స్టాల్స్ లను సందర్శించారు.. ఇదే సమయలో వేదిక దగ్గర రైతులకు విత్తనాలను అందించారు, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించి వారిని అభినందించారు..
ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి , శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య , పాల్ రెడ్డి , శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి , కె ఆర్ నాగరాజ్ , జిల్లా కలెక్టరు, పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,అన్ని శాఖల జిల్లా అధికారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.