T-Congress | పార్టీ నేతలు మూడు కేటగిరీలుగా..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వచ్చినప్పటి నుండి హస్తం పార్టీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలను మూడు గ్రూపులుగా విభజించి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఒక గ్రూప్. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని రెండో గ్రూపుగా, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారిని మూడో గ్రూపుగా విభజించారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ కేట‌గిరీల వారీగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *