సంగారెడ్డి, (ఆంధ్రప్రభ): శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. రెండు వర్గాలు గాని, గ్రూప్ ల మధ్య గాని, కుల, మతాల మధ్య గాని ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే వాఖ్యలు చేసినా, సోషల్ మీడియా వేధికగా పోస్టులు పెట్టిన, ఫార్వర్డ్ మెసేజ్ లు చేసిన ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేసిన వ్యక్తులపై చట్ట రిత్యా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని, కులమతాలకు అతీతంగా పండగలు జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.
Sangareddy | విద్వేష పోస్ట్ లు పెట్టినా .. మాట జారినా కఠిన చర్యలు – ఎస్పీ
